వార్తలకు తిరిగి వెళ్లండి
గుట్టల దోపిడీ: నిబంధనల ఉల్లంఘన

జాతీయ రహదారి పనుల పేరుతో చిట్యాల వద్ద గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా భారీగా మట్టిని తరలిస్తున్నారు. అనుమతించిన పరిమితికి మించి రాత్రింబవళ్లు తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నారు.
అధికారులు నోటీసులు జారీ చేసినా అక్రమ దందా ఆగడం లేదు. మైనింగ్ అధికారుల పర్యవేక్షణ లోపంతో దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోంది. వెంటనే అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...