వార్తలకు తిరిగి వెళ్లండి
సల్కం చెరువు ఎఫ్టీఎల్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉమ్మడి సర్వే నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ఖాన్ ధర్మాసనానికి సమర్పించారు.
అయితే, మ్యాపుల్లో ఆక్రమణలు కనిపిస్తున్నా లేవనడంపై హైకోర్టు మండిపడింది. చెరువుల విషయంలో ప్రభుత్వం 'పిక్ అండ్ చూస్' పద్ధతిలో వ్యవహరిస్తోందని ఆక్షేపిస్తూ, ఈ అంశంలో హైడ్రా ఏం చేసిందని ప్రశ్నించింది.
Comments
Loading comments...