వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం పట్టణంలోని శ్రీలంక కాలనీ ప్రమాదం అంచున నిలిచింది. దీంతో తమను కాపాడాలని కాలనీవాసులు జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు.ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి కాలనీలోని ఇళ్ల మధ్య వరద నీరు భారీగా వచ్చి చేరింది.
రోడ్లన్నీ జలదిగ్బంధనం అయ్యాయి. నడుము లోతులో వరద నీరు ప్రవహిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు పోయే దారి లేకపోవడంతో ఇళ్లు కూడా మునిగిపోయే అవకాశం ఉందని వారు పోయారు.
Comments
Loading comments...

