Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం పీఠంపై కూటమి, వైసీపీ పోరు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:38 PM కోనసీమGeneral
ముమ్మిడివరం పీఠంపై కూటమి, వైసీపీ పోరు - Udayam
ముమ్మిడివరం నగర పంచాయతీ పీఠం కోసం కూటమి, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. 2021 ఎన్నికల్లో 20 వార్డులకు గాను వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో గెలిచాయి. ఈసారి 23 వార్డుల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించాలని టీడీపీ నేతలు శ్రమిస్తున్నారు. గతంలో చేజారిన పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి కసరత్తు చేస్తుండగా, పట్టు నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నగర పంచాయతీలో రాజకీయం వేడెక్కుతోంది.

Comments

G
Loading comments...