Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై లోకల్ ట్రైన్ మర్డర్ కేసు నిందితుడి అరెస్ట్?

శిరీష గౌడ్ Jun 25, 2026 5:41 AM అల్ ఇండియా 4 viewsabout 24 hours ago
చర్చ్‌గేట్-నలసోపారా లోకల్ రైలులో 22 ఏళ్ల ప్రయాణికుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని బొరివలి జీఆర్‌పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన అనంతరం బొరివలి స్టేషన్‌లో దిగి పరారైన నిందితుడి కదలికలను పోలీసులు పసిగట్టారు. దాదాపు 400 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, ఉత్తరప్రదేశ్‌కు పారిపోతుండగా కుర్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడికి త్వరలోనే కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...