వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం లో వివిధ గ్రామాలకు చెందిన 50 మంది బాధితులకు రూ. 27 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 385 మందికి రూ. 3.79 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశామన్నారు.
Comments
Loading comments...

