వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండలంలో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువలకు చెందిన మట్టిని అక్రమార్కులు పగలు, రాత్రి తేడా లేకుండా తోడేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో వేల రూపాయలకు టిప్పర్ల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కాలువల నిర్మాణం, కట్టల కోసం ఉంచిన మట్టిని పనులు పూర్తికాకముందే మాయం చేస్తుండటంతో భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశముంది. అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

