వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి వాడకం, విక్రయాలను అరికట్టేందుకు ఎస్సై కూచిపూడి జగదీష్ నేతృత్వంలో పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
నార్కోటిక్ డాగ్ సహాయంతో సుబ్లేడ్, కాకరవాయి, ముజాహిద్పురం గ్రామాల్లోని గ్రానైట్ క్వారీలు, పాఠశాల పరిసరాలు, ఆలయ ప్రాంతాలు, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Comments
Loading comments...

