Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు మందు ఇచ్చి దోచుకుంటున్న దొంగలు అరెస్ట్

Follow Udayam on Google
Girish Bidkar Aug 29, 2026 8:30 PM హైదరాబాద్General
మత్తు మందు ఇచ్చి దోచుకుంటున్న దొంగలు అరెస్ట్ - Udayam
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మత్తు నీళ్లు ఇచ్చి దోచుకుంటున్న భాత ప్రసాద్, కోరపాటి నర్సింగ్ రావులను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వీరిద్దరూ మద్యానికి బానిసై నేరాలకు పాల్పడ్డారు. వీరి నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ.500 నగదు, 10 మత్తు మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...