వార్తలకు తిరిగి వెళ్లండి

మరిన్ని దేశాల్లో యూపీఐని విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఫిన్టెక్ రంగానికి పిలుపునిచ్చారు. స్థానిక చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానిస్తే ఎన్నారైలకు నగదు బదిలీ ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.
ప్రస్తుతం సింగపూర్ సహా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ఎన్నారైలు ఎక్కువగా ఉన్న, భారత్తో భారీ వాణిజ్య సంబంధాలున్న దేశాల్లో అనుసంధానాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

