వార్తలకు తిరిగి వెళ్లండి
వేధింపులు భరించలేక కొడుకును చంపిన తల్లి

అనంతపురం జిల్లా కేంద్రంలో ఘోరం చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారి డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్న కొడుకు సురేంద్ర (28)ను కన్నతల్లి సునీత కత్తెరతో పొడిచి హత్య చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి, ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...