వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, అటవీ, విద్యాశాఖలు సహా పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
Comments
Loading comments...

