వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అక్రమ లావాదేవీల కేసులో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు రావడంతో శుక్రవారం కొచ్చి కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది.
ఎటువంటి సేవలు అందించకుండానే వీణకు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ సీఎంఆర్ఎల్ నుండి రూ.2.78 కోట్లు పొందిందనే ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే కీలక ఆర్థిక, డిజిటల్ ఆధారాలను సేకరించింది.
Comments
Loading comments...

