వార్తలకు తిరిగి వెళ్లండి

మొహర్రం 'బీబీ కా ఆలమ్' ఊరేగింపు నేపథ్యంలో శుక్రవారం (జూన్ 26) హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్, మదీనా, నయాపూల్, సాలార్జంగ్ పరిసరాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయి.
అలాగే, ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఉండదు. వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

