వార్తలకు తిరిగి వెళ్లండి
మొహర్రం వేడుకలపై డిఎస్పీ సూచనలు
శిరీష గౌడ్ Jun 24, 2026 5:04 AM అనంతపురం 10 viewsabout 19 hours ago

గుత్తి మండలం తొండపాడులో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డిఎస్పీ ఏ. శ్రీనివాస్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుత్తి సిఐ రామారావు, ఎస్ఐ వెంకటస్వామి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...