వార్తలకు తిరిగి వెళ్లండి
క్రీడా పాఠశాలలో ఆధునిక హైజంప్ మ్యాట్ల ప్రారంభం

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో రూ.4.95 లక్షల విలువైన హైజంప్ మ్యాట్లను కలెక్టర్ రాజర్షి షా గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, ప్రతిభావంతులైన క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం క్రీడా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, అక్కడ నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా అధికారులు, శిక్షకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...