వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంథనిలో సీఐటీయూ, రైతు-వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జైల్భరో నిర్వహించారు.
పట్టణంలో ప్రదర్శన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

