వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన బొంగు నిర్మల మనస్తాపంతో ఉరివేసుకున్న ఘటన విషాదంగా మారింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందింది.
భర్త బ్యాంకుకు రావడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై నిర్మల ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

