వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలకు సంబంధించి గ్రామాల్లో మండపాల ఏర్పాటుకు కమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మాచవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

