వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్, కిరాణా, పాన్ షాపుల్లో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు డాగ్స్క్వాడ్తో మెరుపు తనిఖీలు నిర్వహించారు. సీఐ, ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో దుకాణాలను క్షుణ్ణంగా సోదా చేశారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. దుకాణాల్లో గుట్కా, గంజాయి వంటి నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

