వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు మండలం బోడుమల్లివారిపల్లి శివారులోని మల్లేశ్వర గుట్టలో శివలింగం వెలుగులోకి వచ్చింది. పశువులను మేపుతున్న సమయంలో పుట్టలో శివలింగం ఆకారంలో జ్యోతి కనిపించిందని రైతులు, గొర్రెల కాపరులు తెలిపారు.
మట్టిని తొలగించడంతో శివలింగం బయటపడినట్లు గ్రామస్థులు చెప్పారు. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాలు, నీటితో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

