వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పడిన భారీ బుంగను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. 15 మీటర్ల లోతుతో ఏర్పడిన బుంగపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని మందమర్రి జీఎంకు సూచించారు. అవసరమైతే బస్టాండ్లోకి బస్సుల రాకపోకలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

