వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

