వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట పట్టణంలోని మినీ స్టేడియాన్ని అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక యువకులు కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్టేడియం మొత్తం వరద నీటితో నిండిపోయింది.
దీంతో స్థానిక నాయకులు, యువకులు, సోమవారం స్టేడియాన్ని సందర్శించారు. మంచిర్యాల తర్వాత పట్టణంలోనే మినీ స్టేడియం అందుబాటులో ఉందన్నారు. స్టేడియంలో పిచ్చి మొక్కలు పెరిగి, వరద నీరు నిలిచి వినియోగానికి పనికి రాకుండా పోతోందన్నారు.
Comments
Loading comments...

