వార్తలకు తిరిగి వెళ్లండి
విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ ఊరట
స్వాతి రెడ్డి Jun 28, 2026 3:01 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

విండోస్ 10 వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్తో ముగియాల్సిన ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ (ESU) గడువును మరో ఏడాది పొడిగించింది. దీనివల్ల విండోస్ 11కు మారలేని యూజర్లు 2027 అక్టోబర్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ పొందవచ్చు.
అయితే, విండోస్ 10లోనే కొనసాగేందుకు యూజర్లు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువులో కేవలం భద్రతా పరమైన అప్డేట్స్ మాత్రమే లభిస్తాయి, కొత్త ఫీచర్లు ఉండవు.
Comments
Loading comments...