వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ధర్నా చౌక్ వద్ద జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపారు.
దాడికి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భావప్రకటన స్వేచ్ఛను అణిచివేసే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
Comments
Loading comments...

