Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఇన్‌స్పెక్టర్

Follow Udayam on Google
D GANESH Aug 18, 2026 4:11 AM మహబూబ్‌నగర్General
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఇన్‌స్పెక్టర్ - Udayam
మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే పండుగలను సోదరభావంతో, ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. పుకార్లు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరారు. శాంతికి భంగం కలిగించే చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...