వార్తలకు తిరిగి వెళ్లండి
జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ మేదరివాడలో ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో భగవద్గీత పారాయణం ఘనంగా జరిగింది. శ్రావణమాసం ముగింపు సందర్భంగా దేవాలయం పరిసరాలలోని హనుమాన్ దేవాలయంలో ఉన్న శివుని విగ్రహానికి వేద పండితులు అన్న పూజ నిర్వహించారు.
అనంతరం మహిళా భక్తులు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు. భక్తులకు దాతలు అన్నసంతర్పణ చేశారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
Comments
Loading comments...

