వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మెట్ పల్లి లో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 12 మందికి స్వల్ప గాయాలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి.తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...