వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై జరుగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మెట్రో రైల్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దే" అని ఆయన ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను కేసీఆర్ చొరవతోనే 72 శాతం పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఆయన గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల రవాణా అవసరాలను విస్మరిస్తూ, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం హైదరాబాద్ మెట్రో భవిష్యత్తును పణంగా పెడుతోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Loading comments...

