వార్తలకు తిరిగి వెళ్లండి
త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి సవిత
పవని రెడ్డి Jun 25, 2026 5:56 AM అమరావతి 5 viewsabout 23 hours ago

ఏపీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మూడు కొత్త బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. ఇక్కడ ఉచిత కోచింగ్, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు.
త్వరలోనే మరో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని ఆమె స్పష్టం చేశారు. గతేడాది ప్రభుత్వం అందించిన శిక్షణతో 280 మంది బీసీ అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించారని మంత్రి గుర్తుచేశారు.
Comments
Loading comments...