వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో సోమవారం నాగుపాము ప్రత్యక్షమై కలకలం రేపింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వంశీ అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును రెస్క్యూ చేశారు.
అనంతరం నాగుపామును సురక్షితంగా డబ్బాలో బంధించి జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో దుకాణ సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

