వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలలో మౌలిక సౌకర్యాలు లేక ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు కనికారపు అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం దండేపల్లి మండలంలోని కర్ణంపేటలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చాలా ఆదివాసి గిరిజన గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు లాంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

