వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 4,867 మంది ఉద్యోగులను ఆన్లైన్ పద్ధతిలో బదిలీ చేశారు. ఇందులో అత్యధికంగా ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 2,258 మంది ఉన్నారు. నర్సింగ్ సిబ్బందికి సంబంధించి మరో 500 మంది బదిలీలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
కొన్ని చోట్ల క్లరికల్ పొరపాట్లు, బదిలీల్లో వివక్షపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కీలక ఆసుపత్రుల్లో నర్సుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన పొరపాట్లను అధికారులు సరిదిద్దుతున్నారు.
Comments
Loading comments...

