వార్తలకు తిరిగి వెళ్లండి
ఎక్సైజ్ శాఖలో భారీ బదిలీలు: ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జయ ప్రకాష్ Jun 26, 2026 7:24 AM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago

రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 19 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 35 మంది సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, బాధ్యతలు వెంటనే స్వీకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Loading comments...