వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని టీచర్స్ కాలనీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భూగర్భ డ్రైనేజీ పనుల కోసం గత పదేళ్లుగా నిలువ ఉంచిన పైపులకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.
పైపుల వద్ద చెత్త పేరుకుపోవడంతో మంటలు వేగంగా వ్యాపించి, దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
Comments
Loading comments...

