Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనుబోలులో ఘోర ప్రమాదం: 8మందికి గాయాలు

నవీన్ రెడ్డి Jun 25, 2026 4:55 AM నెల్లూరు 10 views1 day ago
మనుబోలులో ఘోర ప్రమాదం: 8మందికి గాయాలు - Udayam Digital
గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నూరు నుండి రొయ్యల ఫ్యాక్టరీకి కూలి పనుల కోసం వెళ్తున్న ఆటో, రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. క్షతగాత్రులను వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...