వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ జగదాంబ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని మైపాల్ తాండ సమీపంలో చిరుత పులి కాలి ముద్రలు కనిపించడంతో రైతులు అప్రమత్తమయ్యారు.
శనివారం పొలాలకు వెళ్లిన రైతులు కాలి ముద్రలను గుర్తించినట్లు తెలిపారు. దీంతో అటవీ సరిహద్దు గ్రామాలు, తాండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచించారు. అటవీ అధికారులు స్పందించి చిరుత సంచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

