వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం నల్లబొడ్లూరుకు చెందిన మాజీ మావోయిస్టు నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ భువనేశ్వర్ జర్పడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. 2011లో లొంగిపోయిన ఆయనను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో 16, ఒడిశాలో 52 కేసులు కలిపి మొత్తం 68 కేసుల్లో విచారణ ఎదుర్కొన్న ఆజాద్ను న్యాయస్థానాలు నిర్దోషిగా ప్రకటించాయి. 15 ఏళ్ల జైలు జీవితం అనంతరం ఆయన స్వేచ్ఛను పొందారు. బుధవారం స్వగ్రామానికి చేరనున్నారు.
Comments
Loading comments...

