వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలో వినాయక విగ్రహాలు అమ్మకానికి సిద్ధమయ్యాయి. సోమవారం వినాయక చవితి కావడంతో వ్యాపారులు అందమైన వినాయక విగ్రహాలను తెప్పించారు. మండల కేంద్రంలోని అంగడి బజార్, ధర్మారం చౌరస్తా, తదితర ప్రాంతాలలో చిన్న, పెద్ద వినాయక విగ్రహాలను వ్యాపారులు అమ్ముతున్నారు.
ఈసారి నిర్వహకులు మట్టి వినాయక విగ్రహాలపై మొగ్గు చూపడంతో వాటి గిరాకీ పెరిగింది. గ్రామాలలో వినాయక మండపాలు సిద్ధమవుతున్నాయి.
Comments
Loading comments...

