Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ యార్డు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన

Follow Udayam on Google
madhu Aug 26, 2026 4:08 PM ములుగుGeneral
మార్కెట్ యార్డు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన - Udayam
తడ్వాయి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం శంకుస్థాపన చేశారు. ఏఎంసీ చైర్మన్ రేగ కళ్యాణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మార్కెట్ యార్డుల అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.3 కోట్లు మంజూరు చేశారని, అందులో భాగంగా రూ.83 లక్షల పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...