వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా మానకొండూర్ లోని పోస్టాఫీసు సమీపంలోని ఎరుగురాల పోచయ్య ఇంట్లో వెలుగుతున్న దీపం కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఇంట అద్దెకు ఉంటున్న శంకరమ్మ, సునందు, యెల్లయ్య కుటుంబాలు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. మానకొండూర్ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
Comments
Loading comments...

