వార్తలకు తిరిగి వెళ్లండి

మునగాల మండలం కలకోవ స్టేజ్ వద్ద సోమవారం లారీ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపై బోల్తాపడింది.
ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

