Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లంచం తీసుకుంటూ దొరికిన GOVT ఆఫీసర్

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 06, 2026 1:52 PM జగిత్యాలGeneral
లంచం తీసుకుంటూ దొరికిన GOVT ఆఫీసర్ - Udayam
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామ పంచాయతీలో గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) రాజేశ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పాస్బుక్లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు మల్లేశ్ నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, రూ.5 వేల లంచం తీసుకుంటుండగా రాజేశ్ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...