వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేటలోని ఆంధ్రాబోర్ లో ఉన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఇంటి యజమానులు ఆరున ఇంటికి తాళం వేసి పని నిమిత్తం హాజీపూర్ వెళ్లారని, మంగళవారం ఉదయం ఇంటి తలుపులు పగలగొట్టి తెరిచి ఉండడాన్ని స్థానికులు గమనించి వారికి సమాచారం ఇచ్చారన్నారు.
యజమానులు వచ్చి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని బీరువాలోని రూ. 12000 నగదు, పావు తులం బంగారం రింగ్ చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారన్నారు.
Comments
Loading comments...

