Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వదిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:39 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
వదిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు - Udayam
వదిన దుర్గను హత్య చేసిన కేసులో విజయవాడ పటమటకు చెందిన హరి (42)కి జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ మహిళా కోర్టు తీర్పునిచ్చింది. విభేదాల కారణంగా దుర్గ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో హరి ఆమెతో చనువుగా ఉండేవాడు. తల్లి మందలించడంతో దుర్గ హరితో మాట్లాడటం మానేసింది. దీంతో కోపంతో 2024 జనవరిలో ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.

Comments

G
Loading comments...