వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ ఆర్థిక రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ (LIC) అత్యధిక లాభాలు గడించిన సంస్థగా అవతరించింది. గడిచిన జనవరి-మార్చి త్రైమాసికంలో ఎల్ఐసీ ఏకంగా రూ.23,420 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.19,013 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో దేశీయ ఆర్థిక సేవల విభాగంలో ఎల్ఐసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

