వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే అన్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు అనుచిత భాష ఉపయోగించారని, అలాంటివి ఎవరూ చేయకూడదని స్పష్టం చేశారు.
అయితే ప్రధాని కూడా తన పార్టీ నేతలకు ఇదే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అసభ్యకర రాజకీయ భాషకు కాషాయ పార్టీ నేతలే శ్రీకారం చుట్టారని ఆరోపిస్తూ, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
