వార్తలకు తిరిగి వెళ్లండి
తక్కువ ధరకే స్థలాలంటూ భారీ మోసం

తక్కువ ధరలకే స్థలాలు ఇప్పిస్తామని నమ్మించి, నకిలీ పత్రాలతో రూ.75 లక్షల మేర మోసానికి పాల్పడిన తండ్రీకొడుకులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిందితులు బాధితుల నుండి డబ్బులు వసూలు చేసి, రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు గురిచేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిందని సీఐ వెల్లడించారు.
Comments
Loading comments...