Back to feed
ల్యాండ్ ఆఫీసర్ ఇంట్లో ₹13 కోట్ల సంపద
Rohit Singh Jun 17, 2026 1:55 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు నివాసాలపై ఏసీబీ అధికారులు భారీ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ₹1.54 కోట్ల నగదు, బంగారం, పలు ప్లాట్లు, ఫ్లాట్లతో కలిపి దాదాపు ₹13 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి సీజ్ చేశారు.
ఆయన కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. భార్య పేరిట ఉన్న లాకర్లను ఇంకా తెరవాల్సి ఉండగా, ఈ ఘటన రెవెన్యూ శాఖలోని అవినీతి తీవ్రతను మరోసారి బహిర్గతం చేసింది.
Comments
Loading comments...


